వరద తాకిడికి కొట్టుకపోయిన రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు..

వరద తాకిడికి కొట్టుకపోయిన రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు..

నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి పెద్దపెల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి వద్ద మానేరు వాగు ఉప్పొంగడంతో భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద తాకిడికి పూర్తిగా కొట్టుకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు గర్మిళ్లపల్లి నుంచి వెళ్లాలంటే 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది కానీ వరద తాకిడికి మట్టి రోడ్డు కొట్టుకపోవడంతో సుమారు 100 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మానేరువాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.