జడ్జ్‌‌గా ఇళయరాజా?

జడ్జ్‌‌గా ఇళయరాజా?

సరిగమప తెలుగు ప్రోగ్రామ్‌‌కు  ప్రేక్షకులనుండి మంచి ఆదరణ ఉంది. పదమూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఎంతో మంది సింగర్స్‌‌ని టాలీవుడ్‌‌కు పరిచయం చేసింది. పద్నాలుగవ సీజన్‌‌ని ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేయడానికి ఆడిషన్స్‌‌ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ ఈ లాస్ట్‌‌వీక్‌‌లో స్టార్ట్‌‌ చేస్తారు.ఈ షోకి కోటి, చంద్రబోస్‌‌, ఎస్‌‌పి శైలజ జడ్జ్‌‌లుగా, ప్రదీప్ మాచిరాజు యాంకర్‌‌‌‌గా ఉన్నారు. అయితే మెయిన్‌‌ జడ్జ్‌‌గా ఫేమస్  మ్యూజిక్‌‌ కంపోజర్‌‌‌‌ ఇళయరాజా వస్తున్నట్టు చెప్తున్నారు. ఒక వేళ అలా చేస్తే ఆయన జడ్జిగా పాల్గొంటున్న మొదటి తెలుగు టీవీ రియాలిటీ షో  ఇదే అవుతుంది.