TSPSC : బండి సంజయ్ కు సిట్ నోటీసులు

TSPSC : బండి సంజయ్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. TSPSC పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ పేర్కొంది. మార్చి 24వ తేదీన సిట్ ఎదుట హాజరవ్వాలని బండి సంజయ్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల క్రమంలో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. 

‘పేపర్ లీకేజీ కుట్ర వెనుక నా పాత్ర ఉందని కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. నాపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కొడుకుకు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్ కు ఉందా..?’ అని ప్రశ్నించారు. కుట్రకు కారకులైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సిట్ నోటీసులకు విచారణకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.