
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి కొచ్చిలో ఆటగాళ్ల వేలం జరుగుతుంది. 10 టీంల్లో 87 స్లాట్లు ఖాళీలు ఉండగా, 405 మంది ప్లేయర్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. పోయిన ఏడాది ఆక్షన్ మధ్యలో అస్వస్థతకు గురైన వేలం నిర్వహకుడు హ్యు ఎడ్మీడెస్ నే ఈసారి వేలాన్ని నిర్వహిస్తాడు.
ఈ మెగా వేలం రసవత్తరంగా జరగనుంది. అందరి దృష్టిని ఆకర్షించనుంది. దీనంతటికి కారణం శామ్ కరన్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్, రబాడా, జో రూట్, విలియమ్ సన్ లాంటి స్టార్ ప్లేయర్లు వేలంలో అందుబాటులో ఉండటమే. అంతేకాకుండా పలు ఫ్రాంచెజీలు జట్టులో కీలక మార్పుల చేయడం కోసం ఎదురుచూస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ కోసం వెతుకుతుండగా, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ విన్నర్ల కోసం చూస్తుంది. బెంగళూరు బౌలర్ల వేట కొనసాగిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండగా పెద్ద ప్లేయర్లను దక్కించుకునే చాన్స్ లు ఉన్నాయి.