ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నిర్బంధాలు తొలగించాలని డిమాండ్

ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నిర్బంధాలు తొలగించాలని డిమాండ్

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ వీసీ చాంబర్ లోకి చొచ్చుకెళ్లారు.  ఈ క్రమంలో వీసీ రవీందర్, విద్యార్థులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఓయూలో గేట్స్ రాత్రి 11 గంటలకు మూసివేయాలని, బారిగేడ్లు, కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ పాలన వీడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 

ఉస్మానియా యూనివర్శిటీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో వీసీ విఫలమయ్యారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని వెళ్లిన విద్యార్థులు..వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వీసీ రవీందర్, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని, పేద విద్యార్థులకు విద్య భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఓయూ అధికారులపై ఉందన్నారు. పరిపాలన భవనంలో బారిగేడ్లు, కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 

ఆందోళనలో పరిశోధక విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓయూలో నిర్బంధాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. వాటన్నింటినీ తొలగించి విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిర్బంధాలన్ని తొలగిపోయి, ఓయూ వీసిని కలవాలంటే ఎలాంటి షరతులు ఉండకూడదన్నారు.