అల్వాల్, వెలుగు: ఈ నెల 20న లయోలా అకాడమీలో జరుగనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలకు చీఫ్ గెస్ట్గా సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారని అకాడమీ యాజమాన్యం తెలిపింది. గురువారం అకాడమీ సొసైటీ చైర్మన్ రెవరెండ్ ఫాదర్ అమర్రావు మీడియాతో మాట్లాడారు. లయోలా అకాడమీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డితో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరవుతారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లయోలా అకాడమీ కరస్పాండెంట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్, ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ బుచ్చిబాబు, జోసెఫ్ కుమార్, ట్రెజరర్ సుధాకర్, ఫాదర్అరుణ్, జ్యోతి, పీటర్, ఫాదర్ తామస్
తదితరులు పాల్గొన్నారు.
