
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు జడ్జీలను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజి యం నిర్ణయం తీసుకుంది. గురు వారం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నేతృ త్వంలో జరిగిన మీటింగ్లో కేంద్రా నికి కొలీజియం సిఫార్సులు చేసింది. తెలంగాణ, మద్రాస్, ఏపీ హైకోర్టుల నుంచి మొత్తం ఏడుగురు జడ్జీల బదిలీపై కొలీజియం సిఫార్సులు చేసింది.
ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ లలితను కర్నాటక హైకోర్టుకు, జస్టిస్ నాగార్జున్ను మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేసింది. ఏపీ హైకో ర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ వేలుమణిని కోల్కతా హైకోర్టుకు, జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేసింది.