గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆదివారం (అక్టోబర్ 22న) బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ జాబితా వెలువడే చాన్స్ ఉంది. ఈ క్రమంలో బీజేపీ మొదటి జాబితాలో రాజాసింగ్పేరు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. గోషామహల్ సీటును రాజాసింగ్కే ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో రాజాసింగ్కు బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో రాజాసింగ్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన అధిష్టానంపై తాజాగా ఆయనపై సస్పెన్షన్ఎత్తివేసింది. 2022, ఆగస్టు 23న రాజాసింగ్పై సస్పెన్షన్ విధించింది. 14 నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసింది.
మరోవైపు.. గోషామహల్సీటును మాజీ మంత్రి ముఖేష్గౌడ్కుమారుడు విక్రమ్గౌడ్ ఆశిస్తున్నారు. రాజాసింగ్ కు గోషామహల్ టికెట్ఇస్తే విక్రమ్ గౌడ్ పరిస్థితి ఏంటన్నదానిపై బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. విక్రమ్ కు మరో స్థానంలో సీటు ఇస్తారా..? లేక ఆయన్ను పక్కన పెడుతారా..? అనే చర్చ సాగుతోంది.
Also Read :- భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువు తారుమారు
మొత్తంగా అందరూ అనుకున్నట్లుగానే.. ఊహించినట్లుగానే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్వేటు ఎత్తివేసింది. దీంతో ఆయన అభిమానులు, అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఆదివారం (అక్టోబర్ 22న) ఏ క్షణంలో అయినా బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.