మల్లెపూలకు మస్తు రేటు

మల్లెపూలకు మస్తు రేటు

మల్లెపూలకు రికార్డ్ స్థాయి రేటు పలుకుతోంది. తమిళనాడు మార్కెట్ లో ఏకంగా 2 వేల 800 రూపాయలకు కేజీ పలుకుతోంది. దీంతో మల్లె పూలు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. పంట దిగుబడి తగ్గటం... వరుసగా పండగలతో పాటు శుభకార్యాలు ఉండటంతో మల్లెపూలు భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయంటున్నారు వ్యాపారులు.  

రేట్లు భారీగా పెరగటంతో...కేజీకొనే వారు హాఫ్ కేజీతోనే సరిపెట్టుకుంటున్నారంటున్నారు. మల్లె పూలతో పాటు మిగతా వాటికి కూడా భారీగా రేట్లు పెరిగాయంటున్నారు.