నగరంలో కోటి రూపాయ‌ల హవాలా డబ్బు సీజ్

నగరంలో కోటి రూపాయ‌ల హవాలా డబ్బు సీజ్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఆదివారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నగదును సీజ్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లను రాజకీయ పార్టీల నేతలు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు రూ. కోటి రూపాయాల నగదును పోలీసులు సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మార్గంలో ఈ డబ్బును తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.