
హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్పై దాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ భద్రతపై హై అలర్ట్ అయ్యింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. బుధవారం రాత్రి స్పీకర్ చాంబర్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ఒవైసీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
పార్లమెంట్పై అగంతకుల దుశ్చర్యను వారు ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీకి వచ్చే వారిని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలన్నారు.