ఎంజేపీఆర్​ఎస్​సీలో నలుగురు స్టూడెంట్స్​ టెన్త్​ మెమోలు మిస్

ఎంజేపీఆర్​ఎస్​సీలో నలుగురు స్టూడెంట్స్​ టెన్త్​ మెమోలు మిస్

మెదక్, వెలుగు : మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్సియల్​ స్కూల్​/కాలేజీ (ఎంజేపీఆర్​ఎస్​సీ)లో నలుగురు స్టూడెంట్స్​ టెన్త్​ మెమోలు మిస్సయ్యాయి. బాధితుల కథనం ప్రకారం...సమీక్ష, కావేరి, జ్యోతి, సింధు అనే స్టూడెంట్స్​ 2020 -–21వ సంవత్సరంలో ఈ స్కూల్​లోనే 10వ తరగతి పూర్తి చేశారు. ఒకరు ఇదే కాలేజీలో..మరో ముగ్గురు వేరే చోట ఇంటర్ లో చేరారు.

ఎంసెట్ ​కౌన్సిలింగ్​, ఆధార్​అప్​డేషన్, పై చదువులు, ఇతర సర్టిఫికెట్ల కోసం కోసం టెన్త్​ మెమోలు అవసరమై మంగళవారం స్కూల్​కు వెళ్లగా మెమోలు కనిపించడం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రజిని వివరణ కోరగా మెమోలు కనబడకుండా పోయింది నిజమేనని, డూప్లికేట్​ మెమోలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్టూడెంట్స్​ పై చదువులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు.