భారత్, విండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్..ఆట నిలిచే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్, శుభమన్ గిల్..జట్టుకు అద్భుత ఆరంభానిచ్చారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే 58 పరుగులు చేసిన ధావన్..113 పరుగుల వద్ద పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వర్షం రావడంతో..మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ 51 పరుగులతో..శ్రేయస్ అయ్యర్ 2 పరుగులతో ఉన్నారు.
#WIvIND, 3rd ODI: Shikhar Dhawan (54*) and Shubman Gill (44*) complete century stand, India's score reads 101/0 in 20 overs.
— ANI (@ANI) July 27, 2022