స్కూల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ : కరుణాకర్ రెడ్డి

స్కూల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ : కరుణాకర్ రెడ్డి

మనోహరాబాద్, వెలుగు : ఓవర్ టేక్ చేసి స్కూల్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విజ్ఞాన్ స్కూల్ కు చెందిన స్కూల్ బస్ స్టూడెంట్స్, టీచర్ ను ఎక్కించుకొని మేడ్చల్ వైపు వెళ్తున్నది. కాళ్లకల్ జాతీయ రహదారిపై స్కూల్ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో స్కూల్ బస్సులో ఉన్న పిల్లలకు, టీచర్​కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే మేడ్చల్​లో  ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించి చికిత్స చేశారు.  స్కూల్ బస్సు డ్రైవర్ కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.