మెట్రోట్రైన్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎంపీ 

మెట్రోట్రైన్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎంపీ 

రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో మెట్రో ట్రైన్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా ఏర్పాట్లను టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సభా ఏర్పాట్లను పరిశీలించారు.

పోలీస్ అకాడమీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగసభకు సుమారు 30 వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రహరీ గోడను మూడు చోట్ల తొలగించి తాత్కాలిక రాకపోకలు ఏర్పాటు చేశారు.