యునైటెడ్ నేషన్స్: ఉక్రెయిన్లో రష్యా సైనికుల మానవ హక్కుల ఉల్లంఘనలపై యునైటెడ్ నేషన్స్ కఠిన చర్యలు తీసుకుంది. యూఎన్ హ్యూమన్రైట్స్ కౌన్సిల్(యూఎన్హెచ్ఆర్సీ) నుంచి రష్యాను సస్పెండ్ చేసింది. ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, రష్యన్ సోల్జర్లు సామాన్య జనాలను చంపేస్తున్నారని పేర్కొంటూ అమెరికా ..‘సస్పెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్ ఇన్ ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటు వేశాయి. 24 దేశాలు వ్యతిరేకించాయి. ఇండియా సహా 58 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరి నుంచి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, హ్యూమన్రైట్స్ కౌన్సిల్ లో 8 సార్లు ప్రవేశపెట్టిన తీర్మానాలు, ఓటింగ్కు మన దేశం దూరంగా ఉంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో రష్యా మెంబర్షిప్ 2023 డిసెంబర్ వరకు ఉంది. అయితే ఇప్పుడు రష్యాను సస్పెండ్ చేశారు. 2006లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను ఏర్పాటైనప్పటి నుంచి ఒక దేశ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం ఇది రెండోసారి. 2011లో లిబియాలో అప్పటి నియంత ముమ్మర్ అల్ గడాఫీ అణచివేతల కారణంగా ఆ దేశాన్ని సస్పెండ్ చేశారు. కాగా, యుద్ధ నేరాలకు పాల్పడే వారికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చోటు లేదని, ఈ నిర్ణయం తీసుకున్న ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. మద్దతిచ్చిన దేశాలకు రుణపడి ఉంటామని ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ దిమిత్రో కులేబా ట్విట్టర్ లో ప్రకటించారు.
ఇండియాకు అమెరికా వార్నింగ్
రష్యాతో సంబంధాలను కొనసాగిస్తే మూల్యం చెల్లించక తప్పదని ఇండియాను అమెరికా మరోసారి హెచ్చరించింది. రష్యాపై ఓటింగ్ కు ముందే అమెరికా ప్రెసిడెంట్ ఎకనమిక్ అడ్వయిజర్ బ్రియాన్ డీస్ ఈ హెచ్చరిక చేశారు. అయినా, రష్యాతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ కు ఇండియా మరోసారి దూరంగా ఉండిపోయింది.