
సిరిసిల్లకు చెందిన బుధవారపు మల్లేశం కూకట్పల్లి జేఎన్టీయూలో ఎలక్ర్టానిక్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేశాడు. వెహికిల్స్ దొంగతనాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఒక డివైజ్ను కనుగొన్నాడు. అందులో స్కానింగ్ మాడ్యూల్, మైక్రో కంట్రోల్ పోగ్రాంను ఇన్స్టాల్ చేశాడు. ఆర్సీ కార్డు, లైసెన్స్ ఏదైనా ఒకటి స్కాన్ చేస్తేనే వెహికిల్ స్టార్ట్ అవుతుంది. లేదంటే బండి నడవడం కష్టమే. ఈ సిస్టంలో వైర్లెస్కార్డు స్కానింగ్ మాడ్యూల్ ఇంటిగ్రేడెట్ సర్క్యూట్ ద్వారా వెహికిల్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆర్సీ నంబర్ లేదా లెసెన్స్ నంబర్తో లింక్ చేసిన కార్డును స్కాన్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీని ఈ మధ్యే సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ప్రయోగాత్మకంగా నిరూపించాడు మల్లేశం. గతంలో కూడా ఇలాంటి పలు ఆవిష్కరణలు చేశాడు. చిన్నపిల్లలను కాపాడే డివైజ్, ప్రమాదాలు నివారించే డివైజ్, ఆటోమెటిక్గా వెలిగే స్ట్రీట్ లైట్స్ తయారుచేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు.