కలెక్టర్​కు కంప్లైంట్​ ఇచ్చిందని పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధం

కలెక్టర్​కు కంప్లైంట్​ ఇచ్చిందని పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధం

కోదాడ, వెలుగు: ఉపాధి పనులపై కలెక్టర్​కు కంప్లైంట్ ​ఇచ్చిందని కార్మిక సంఘం నాయకురాలిని గ్రామస్తులు పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో చోటుచేసుకుంది. గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలిది పద్మావతి ఇటీవల కలెక్టర్​కు ఫిర్యాదు చేసింది. డీఆర్‌‌‌‌డీఏ అధికారులు బుధవారం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఆఫీసర్లు వెళ్లిపోయాక గ్రామంలోని ప్రశాంత వాతావరణాన్ని కావాలనే చెడగొడుతున్నారని సర్పంచ్‌‌ ‌‌వర్గానికి చెందిన కొందరు పద్మావతితో గొడవకు దిగారు. దీంతో గ్రామస్తులు పద్మావతితోపాటు ఆమెతో ఉన్న కొందరిని పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధించారు. సీపీఎం నాయకుడు ముల్కలపల్లి రాములు వచ్చి సర్పంచ్​వర్గంతో వాగ్వాదానికి దిగారు. ఇదేం పని అని ప్రశ్నించారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని విడిపించారు. ఈ ఘటనపై పీఎస్​లో కంప్లైంట్​చేస్తానని పద్మావతి చెప్పారు.