ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన వాయిదా

ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన వాయిదా

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్.. భారత పర్యటన వాయిదా పడింది. ఆయన ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు ఇండియాలో పర్యటించేందుకు రాబోతున్నారని కొద్ది రోజుల ముందు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఆయన నిన్న కరోనా బారినపడ్డారు. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే పర్యటన ఉండడంతో దానిని వాయిదా వేస్తున్నట్లు ఇండియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి ముహమద్ హయీబ్ తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికయ్యాక నఫ్తాలీ బెన్నెట్ తొలిసారిగా భారత పర్యటనకు సిద్ధమైన ఈ సమయంలో ఆయన కరోనా బారినపడ్డారు. వాస్తవానికి ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ఆయన భారత్ లో పర్యటించాల్సి ఉంది. దీనిపై గత వారమే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటన గురించి ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మొదటిసారి భారత్ లో పర్యటించనున్నారని పేర్కొంది. ‘‘ఇజ్రాయెల్, భారత్ ల మైత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ ను మోడీ భారత్ కు ఆహ్వానించారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యవసాయం, ఇరిగేషన్, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి తదితర రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. అయితే ఈ సమయంలో ఆయనకు కరోనా రావడంతో పర్యటన వాయిదా పడింది.

మరిన్ని వార్తల కోసం..

టీఆర్ఎస్ ఎంపీలు కాలక్షేపం చేస్తుండ్రు

ఇక కరోనా కాలర్ ట్యూన్‌కు గుడ్ బై?

13 ఏండ్లకే సొంత బ్రాండ్.. లక్షల్లో సంపాదన