హైదరాబాద్: ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ... పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, మిగతా రాష్ట్రాలకు మరో నీతియా అంటూ విమర్శించారు. పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వం వందశాతం వడ్లు కొనుగోలు చేసిందని, తెలంగాణలో ఎందుకు వడ్లు కొనడంలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే వీళ్ళు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందన్నారు.
పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. కేంద్రం పంజాబ్లో వడ్లు 100%
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2022
కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలి..
We Demand One Nation One Procurement Policy.#KCRWithFarmers#RaithuBandhuKCR
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2022
ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న కేసీఅర్ గారు రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారు.