అయిదేళ్లయ్యింది ఈ ఫొటో బయటకు వచ్చి. ఆ రోజున ప్రపంచమంతా కన్నీరు కార్చింది. మధ్యధరా సముద్రపు ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన మూడేళ్ల కుర్దిష్ బాయ్ అలన్ కుర్ది మృతదేహం ఇది. సిరియా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్తున్న కుర్దిష్లకు చెందిన ఓ కుటుంబంలోని పిల్లవాడు అలన్. టర్కీ ఫొటో జర్నలిస్టు నిలుఫర్ డెమిర్ దీనిని తీశాడు.
ఇన్నేళ్లలో కుర్దిష్ రిఫ్యూజీల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్ని తొలగించాలన్న డిమాండ్తో సివిల్ వార్ ఆరంభమైంది. ప్రభుత్వ బలగాలకు, వేర్వేరు సాయుధ తిరుగుబాటు దళాలకు మధ్య మొదలైన ఈ యుద్ధం ఇప్పడు.. జాతుల పోరాటంగా మారిపోయింది.