
హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరునితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శంకర్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. మధ్యానికి బానిసైన శంకర్.. నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. దాంతో విసిగిపోయిన భార్య.. తన సోదరునితో కలిసి భర్తను రాడ్తో కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.