బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల వివాదం

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల వివాదం

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. స్థానిక బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మే 4వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరామ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా రోడ్లపై ఉన్న స్ట్రీట్ లైట్ లకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ కార్యకర్తలు.

మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగించడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని.. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మే 5వ తేదీన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజు ఉండడంతో అధికార పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి.. నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలను మీర్ పేట్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.