
ఉత్కంట పోరులో శ్రీలంక పై తొలి టీ20లో నెగ్గిన టీమిండియా, పుణె వేదికగా జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 207 పరుగుల భారీ చేదనతో భరిలోకి దిగిన భారత్ 57 పరుగులకే 5 వికెట్లు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ గా వచ్చిన శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ రెండు మ్యాచుల్లో ఘోరంగా విఫలం అయ్యారు. అయితే, ఈ సిరీస్ లో ఆడిన రెండు మ్యాచ్లుతో పాటు గతంలోనూ ఆడిన టీ20ల్లో పెద్దగా రికార్డ్ లేని గిల్ ని ఈ మ్యాచ్ లో పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. అతని ప్లేస్ లో రుతురాజ్ గైక్వాడ్ కి జట్టులో స్థానం దక్కుతుంది అనిపిస్తుంది.
ఐపీఎల్ లో చెన్నై తరుపున ఆడిన గైక్వాడ్ ఒక సీజన్లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దేశవాళి క్రికెట్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. తాజాగా ఒకే ఓవర్లో 7 సిక్సర్లు (ఒక నో బాల్) కొట్టి రికార్డ్ సృష్టించాడు. గత కొంత కాలంగా రాణిస్తున్న గైక్వాడ్ ని పక్కన పెట్టి, ఏ రికార్డ్ లేని శుభ్ మన్ గిల్ ని ఆడిస్తుండటంపై క్రికెట్ ఎక్స్ పర్ట్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే 3వ టీ20లో గైక్వాడ్ కి తుది జట్టులో చోటు దక్కేలా కనిపిస్తుంది. గతంలో కొన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం వచ్చినా గైక్వాడ్ వాటిని వినియోగించుకోలేదు. తొందర పాటు, షాట్ సెలక్షన్ వల్ల వికెట్ పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటిని పక్కనబెట్టి కేప్టెన్, సెలక్టర్లు శుభ్ మన్ గిల్, గైక్వాడ్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాల్సిందే.