ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ లేదు

ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ లేదు
  • కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్‌ 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి అవుతోందన్న వార్తలపై కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్‌ స్పందించారు. ఏపీలో కరోనా కొత్త మ్యూటెంట్ లేదని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా గుర్తించిన బీ167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మధ్యకాలంలో బీ618 రకాన్ని కనుగొన్నప్పటికీ.. అది త్వరగా కనుమరుగైందని రేణూ స్వరూప్‌ పేర్కొన్నారు. ఎన్‌440కే వైరస్‌ ప్రభావం దేశంలో ఎక్కడా కనిపించలేదని క్లారిటీ ఇచ్చారు. దేశంలో చాలా చోట్ల బీ167 వైరస్‌ ప్రభావం ఉందన్నారు.