కెపాసిటీని రోజుకి 2600 టన్నులకి పెంచాం
లిండే ఇండియా ఎండీ అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచడానికి అన్ని రకాలుగాను ప్రయత్నిస్తున్నట్లు లిండే ఇండియా చెబుతోంది. నైట్రోజన్లాంటి ఇతర గ్యాస్ల కోసం ఉంచిన కంటెయినర్లనూ ఆక్సిజన్ కోసమే వాడుతున్నట్లు వెల్లడిస్తోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాలకి ప్రొడక్షన్ సెంటర్లు చాలా దూరంగా ఉండటంతో అక్కడికి చేర్చడం పెద్ద సమస్యగా మారిందని కంపెనీ పేర్కొంటోంది. దేశాన్ని మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి లిక్విడ్ ఆక్సిజన్ కొరత లేదు. కానీ, ఫ్యూచర్లో ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని లిండే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అభిజిత్ బెనర్జీ చెప్పారు. ఆక్సిజన్ ప్రొడక్షన్ జరిగే ప్రాంతాలకు, ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్తో డిమాండ్ పెరిగిన ప్రాంతాలకూ దూరం ఎక్కువగా ఉండటమే సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రోబ్లమ్కి సొల్యూషన్ వెతకడం మీదే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.