అప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్​మెంట్​ మరిచారు!.. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో సమస్యలెన్నో

అప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్​మెంట్​ మరిచారు!.. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో సమస్యలెన్నో
  • హెల్త్ మినిస్టర్ ​పైనే ఆశలు

మెదక్, తూప్రాన్​, వెలుగు: 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​ పరిస్థితి. పేరుకు పెద్ద హాస్పటిల్స్​ ఉన్నా ఇక్కడ అందే సేవలు అంతంత మాత్రమే. గత బీఆర్ఎస్  ప్రభుత్వం జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​ ను అప్ గ్రేడ్ చేసింది కానీ అందుకు అనుగుణంగా స్పెషలిస్ట్ డాక్టర్లను, స్టాఫ్ ను నియమించలేదు.

చికిత్సలకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చలేదు. బీఆర్ఎస్​హయాంలో హెల్త్​ మినిస్టర్​గా హరీశ్​రావు ఉన్నప్పటికీ  గవర్నమెంట్​ హాస్పిటల్స్​ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆందోల్​ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ హెల్త్​మినిస్టర్​అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​ పై ప్రత్యేక దృష్టిపెట్టి అవసరమైన డాక్టర్లను, ఎక్విప్​మెంట్​ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

తూప్రాన్ సీహెచ్​సీలో..

ఇదివరకు ఇక్కడున్న పీహెచ్ సీ ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీ హెచ్ సీ) గా అప్ గ్రేడ్ చేశారు. 50 బెడ్స్ ఉన్న ఈ హాస్పిటల్​లో పూర్తిస్థాయి డాక్టర్లు, స్టాఫ్, పరికరాలు లేక రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఈ హాస్పిటల్​లో ఈఎన్​టీ స్పెషలిస్ట్​లతోపాటు, ఆయా విభాగాలకు అవసరమైన పరికరాల కొరత ఉంది. డయాలసిస్​సెంటర్​, ట్రామాకేర్​ సెంటర్​ అవసరముంది. లేటెస్ట్​ ఆల్ట్రాసౌండ్​ మిషన్​తోపాటు, రేడియాలజిస్ట్ ను నియమించాలి. 

నర్సాపూర్​ ఏరియా హాస్పిటల్​లో.. 

వంద బెడ్స్ స్థాయికి అప్ గ్రేడ్ అయిన ఈ హాస్పిటల్​లో డాక్టర్లు, నర్సింగ్​ స్టాఫ్​, ల్యాబ్ టెక్నీషియన్​, పారామెడికల్​స్టాఫ్​ కొరత ఉంది. అలాగే సిటీ స్కాన్​ మిషన్​, సెల్​ కౌంట్​మిషన్​, ఫొటో థెరఫీ యూనిట్​ అవసరం ఉంది. కంప్యూటర్లు, ఆఫీస్​ టేబుల్స్​, కుర్చీలు కూడా అవసరం ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్​ కోసం పర్మిషన్​ రావాల్సి ఉంది. 

రామాయంపేట సీహెచ్​సీలో..

పీహెచ్​సీ నుంచి సీహెచ్​సీగా అప్​గ్రేడ్​ అయిన ఈ హాస్పిటల్​కు రెగ్యులర్ ​క్యాడర్​ స్ట్రెంత్​ మంజూరు కాలేదు. రేడియాలజిస్ట్​, ఈఎన్​టీ, ఐ స్పెషలిస్ట్ డాక్టర్లు, డయాలసిస్​ సెంటర్​, లేటెస్ట్​ ఆల్ట్రాసౌండ్​ మెషీన్, సీ-ఆర్మ్​ మిషన్​, బేబీ వార్మర్​, ఫొటో థెరఫీ యూనిట్, డెంటల్​ చైర్, అంబులెన్స్, డెడ్ బాడీ ఫ్రీజర్​బాక్స్, జనరేటర్​అవసరం ఉన్నాయి. 

కౌడిపల్లి సీహెచ్​సీలో.. 

పీహెచ్​సీ నుంచి సీహెచ్​సీగా అప్​గ్రేడ్​ అయిన ఈ హాస్పిటల్​కి రెగ్యులర్​క్యాడర్​స్టెంత్​ మంజూరు కాలేదు. అదనపు డాక్టర్లతో పాటు, అంబులెన్స్, డేటాఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్​ అవసరం ఉంది.  

జిల్లా హాస్పిటల్​లో..

గతంలో మెదక్ లో గవర్నమెంట్​ ఏరియా హాస్పిటల్​ మాత్రమే ఉండేది. 2016లో మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యాక ఈ హాస్పిటల్​ జిల్లా హాస్పిటల్​గా అప్ గ్రేడ్ అయింది. ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్, డయాగ్నోసిస్ హబ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వివిధ విభాగాల్లో డాక్టర్లు,  స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కొరత ఉంది.

Also read : ఆదిలాబాద్లో ఈజీఎస్​ రోడ్ల పనుల్లో ప్రొటోకాల్ లొల్లి

అంతేగాక కొన్ని పరికరాలు కూడా అవసరం ఉన్నాయి. ఈ హాస్పిటల్​లో ఉన్న సీఆర్మ్​ మిషన్ ​పాడైపోగా జనగామ హాస్పిటల్​ నుంచి టెంపరరీగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం ఉన్న అంబులెన్స్​తరచూ రిపేర్​కు వస్తున్నందున, మోడ్రన్​ అంబులెన్స్ తో పాటు, డ్రైవర్​ను సమకూర్చాల్సిన అవసరం ఉంది. కరెంట్​ బిల్లు భారం అధికమవుతున్నందున సోలార్​ ప్యానెల్ ఏర్పాటుచేయాలి.​ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్​) ఒక అంబులెన్స్​ కావాలి. ఇక్కడ సెల్​ కౌంట్​మిషన్​, బయోకెమిస్ట్రీ ఎనలైజర్, ఎమర్జెన్సీ డెలివరీ, క్యాజు​వాలిటీ కేసుల కోసం అవసరమైన పరికరాలు, మొబైల్​ఎక్స్​రే మిషన్​ కావాలి.