ట్రాఫిక్ దృష్ట్యా దారి మళ్లింపులు ఉండొచ్చు

ట్రాఫిక్ దృష్ట్యా దారి మళ్లింపులు ఉండొచ్చు

ఇయాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయంయాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30వరకు కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ నిలిపివేసే లేదా మళ్లించే అవకాశం ఉండొచ్చని రాచకొండ పోలీసులు తెలిపారు.

NGRI మెట్రో స్టేషన్, జెన్‌పాక్ట్, హనుమాన్ దేవాలయం, ఉప్పల్ ఎక్స్ రోడ్, వీటీ కమాన్, టయోటా, నల్ల చెర్వు కట్ట, పీర్జాదిగూడ ఎక్స్ రోడ్, ఉప్పల్ బస్ డిపో, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల ఎక్స్ రోడ్, సీపీఆర్‌ఐ, నారపల్లి, కొర్రెముల వై జంక్షన్, మెక్ డొనాల్డ్స్, ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్, బీబీనగర్, యాదాద్రి పట్టణం మార్గాల్లో ట్రాఫిక్ దృష్ట్యా దారి మళ్లింపులు ఉండొచ్చని చెప్పారు. కాబట్టి పౌరులు ఈ సమయంలో ఉప్పల్ రింగ్ రోడ్‌కు బదులుగా మీ ప్రయాణాలను ORR పైన ఘట్‌కేసర్ నుండి LB నగర్ మీదుగా  లేదా ఘట్‌కేసర్ ORR రింగ్ రోడ్  నుండి కుషాయిగూడ దారిలో  ప్లాన్ చేసుకుని సహకరించగలరని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.