సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సికింద్రాబాద్ తాడ్ బంద్ నుండి బోయిన్ పల్లి, బాలానగర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ దారి గుండా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ఒక్కరు కూడా సంబంధిత డిపార్ట్ మెంట్ పోలీసులు లేకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ టైం కావడంతో స్కూల్స్ కు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.