కాషాయ బట్టలు, టోపీలు పెట్టుకొని అల్లర్లకు కుట్ర చేస్తున్నరు

కాషాయ బట్టలు, టోపీలు పెట్టుకొని అల్లర్లకు కుట్ర చేస్తున్నరు

కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో ముఖ్యమంత్రిపై వాఖ్యలు చేయడం అస్సాం సంప్రదాయమా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు..చెడగొట్టేందుకే అస్సాం సీఎం వచ్చారా..? అని ప్రశ్నించారు. గణేష్ ఉత్సవ సమితి కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి, గొడవలు సృష్టించే కుట్రలు చేశారని ఆరోపించారు. అందుకోసమే ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చారని దుయ్యబట్టారు. 

కాషాయ బట్టలు, టోపీలు పెట్టుకొని అల్లర్లకు కుట్ర చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారన్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకే బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి ఈ మధ్య తరచూ వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నో  సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయన్న దానం.. సీఎం కేసీఆర్ మత సామరస్యానికి కృషి చేస్తుంటే, బీజేపీ మత ఘర్షణలు చేయాలని చూశారన్నారు. నందుబిలాల్ ఏం తప్పు చేశారన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నిరసన తెలిపారన్నారు.