ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన్రు : సిద్ధార్థ్

ఎయిర్ పోర్టు  సెక్యూరిటీ  సిబ్బంది  దురుసుగా ప్రవర్తించిన్రు : సిద్ధార్థ్

హీరో సిద్ధార్థ్కు మధురై ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని సిద్ధార్థ్ ఆరోపించారు. ఎయిర్ పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వస్తుండగా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకొని చెకింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారన్నారు. పదే పదే హిందీలో మాట్లాడారని.. ఇంగ్లిష్‌లో మాట్లాడాలని ఎంతగా వేడుకున్నా కనకరించలేదన్నారు . 

‘‘మధురై ఎయిర్‌పోర్టులో నన్ను, నా తల్లిదండ్రులను సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. నా పేరెంట్స్ జేబులు, సంచుల్లో నుంచి నగదును తీయాలని ఆర్డర్‌ వేశారు. హిందీలో మాట్లాడుతూ అసహనం కలిగేలా ప్రవర్తించారు. అధికారులు పదే పదే హిందీలో మాట్లాడటంతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరినప్పటికీ నిరాకరించారు. దీనిపై ప్రశ్నిస్తే ఇండియాలో ఇలాగే ఉంటుందని అన్నారు’’ అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఘటనపై ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సిద్ధార్థ్ తెలిపారు.