పంజాగుట్టలో దారి దోపిడీ

పంజాగుట్టలో దారి దోపిడీ

హైదరాబాద్ సిటీలోని పంజాగుట్టలో శుక్రవారం రాత్రి దారి దోపిడి జరిగింది. గోల్డ్ షాప్ క్లోజ్ చేసి యజమాని క్యాష్ తీసుకెళ్తుండగా గ్రీన్ ల్యాండ్స్ సమీపంలో దుండగులు సడన్ గా వచ్చి చేతిలోని క్యాష్ బ్యాగులు లాక్కెళ్లారు. రెండు బ్యాగుల్లో 3 లక్షల 5 వేల రూపాయలు ఉన్నాయి. అయితే షాప్ యజమాని వెంటనే తేరుకుని దొంగలను వెంబడించడంతో లక్షా 5 వేలు ఉన్న బ్యాగ్ వదిలేసి, 2 లక్షల బ్యాగ్ తో  దొంగలు పరారయ్యారు. ఈ  ఘటనపై బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. దారి దోపిడీ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, దొంగలను వీలైనంత త్వరగా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. దొంగలు పక్కాగా గోల్డ్ షాపుపై రెక్కీ చేసి.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

బల్మూరిపై గాడిద దొంగతనం కేసు.. అర్ధరాత్రి అరెస్ట్

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరి శిక్ష

నిలువెత్తు బంగారం సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి