చోరీ కోసం వచ్చాడు..పారిపోతూ బావిలో పడిన దొంగ

చోరీ కోసం వచ్చాడు..పారిపోతూ బావిలో పడిన దొంగ

ఓ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడో దొంగ. అర్థరాత్రి వెళ్దామని భావించాడు. అనుకున్న ప్రకారం అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు. సామాను సర్దేయబోతుండగా..ఏదో అలికిడి వినిపించింది. అంతే యజమానులు లేచారని భావించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న చేదుబావిలో పడిపోయాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. 

 మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఒక ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చాడో దొంగ. వస్తువులు చోరీ చేస్తుండగా..అలికిడి వినిపించింది. దీంతో అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అదుపు తప్పి ఇంట్లో ఉన్న బావిలో పడిపోడి చనిపోయాడు. ఈ విషయాన్ని యజమానులు పోలీసులకు తెలియజేయడంతో..ఘటనా స్థలానికి చేరుకున్నారు. యజమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.