గండిపేటలోని మూడు విల్లాల్లో 32 తులాల బంగారం ఎత్తుకెళ్లిన్రు

గండిపేటలోని మూడు విల్లాల్లో 32 తులాల బంగారం ఎత్తుకెళ్లిన్రు

గండిపేట, వెలుగు : రాజేంద్రనగర్​లో  దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇండ్లలో చొరబడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌  పరిధిలోని ఎస్‌‌‌‌ఎం ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లోని మూడు విల్లాస్​లోకి  మంగళవారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. 

కబోర్డులో దాచిన  32 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లోని మరో రెండు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో విలువైన సామగ్రి లేకపోవడంతో సామన్లను చిందరవందర పడేసి వెళ్లిపోయారు. బాధితుల  ఫిర్యాదుతో ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  క్లూస్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.