
ఆదిలాబాద్టౌన్, వెలుగు: గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు రూ.14 లక్షలతో ఉడాయించారు. ఆదిలాబాద్ పట్టణం రాంనగర్కాలనీలోని ఎస్బీఐ బ్రాంచ్ఏటీఎం సెంటర్లో శనివారం ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎం సెంటర్లోకి చొరబడిన దుండగులు సీసీ కెమెరాలకు బ్లాక్ స్ర్పే చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, మావల, వన్టౌన్సీఐలు కె.స్వామి, సునీల్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.