- రేపు 530 జీపీల్లో ఆఖరి పల్లెపోరు
- ఓరుగల్లులో 564 జీపీలు, 4,846 వార్డులు
- ఇప్పటికే 34 జీపీల్లో సర్పంచులు, 792 వార్డుల ఏకగ్రీవం
- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు, పోలీస్ సిబ్బంది
- షురూ అయిన క్యాండియేట్ల ప్రలోభాలు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆఖరి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం స్థానికపోరు జరగనుంది. ఆరు జిల్లాల్లోని కలెక్టర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలో పరిధిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి సీపీ సన్ప్రీత్సింగ్ ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్త్ పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్పీలు సిబ్బంది డ్యూటీలపై ఫోకస్ పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
530 జీపీల్లో సర్పంచులకు బ్యాలెల్ పోరు..
ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం ముగియడంతో ఓట్ల కోసం 17న బ్యాలెట్ పోరు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల నుంచి చివరి విడతలో 564 జీపీలు ఉన్నప్పటికీ 34 చోట్ల ఏకగ్రీవాలు కావడంతో మిగతా 530 చోట్ల మాత్రమే సర్పంచ్ కోసం పోటీ ఉండనుంది. దీనికోసం 1,771 మంది రెడీ అయ్యారు. ఇక మూడో విడతలో 4,846 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, బరిలో 9,972 మంది ఉన్నారు.
792 మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థి ఏ పార్టీ మద్దతుదారుడనే విషయంలో క్లారిటీ ఉంది. రెండు విడతల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీలు చివరి ఎన్నికను సవాల్గా తీసుకున్నాయి. పెద్ద జీపీలు, జనరల్ కోటా రిజర్వేషన్లు ఉన్నచోట ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి మనీ, మందుతో ప్రలోభాలు మొదలు పెట్టారు.
మూడో విడత మండలాలు
- వరంగల్: నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట
- హనుమకొండ: ఆత్మకూర్, దామెర, నడికుడ, శాయంపేట
- జనగామ: దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల
- భూపాలపల్లి: మల్హర్రావు, మహదేవ్పూర్, మహా ముత్తారం, కాటారం
- ములుగు: వెంకటపురం, వాజేడు, కన్నాయిగూడెం
- మహబూబాబాద్: డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్
ఎన్నికల ప్రచారంలో లీడర్లు..
నర్సంపేట: మూడో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం ఆయా గ్రామాల్లో హోరెత్తించారు. పలుచోట్ల పార్టీల నుంచి మద్దతు ఇచ్చిన అభ్యర్థుల తరఫున ప్రజాప్రతినిధులు, లీడర్లు ప్రచారంలో పాల్గొని, మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల తరఫున నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించగా, ఖానాపురం మండలంలో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
మూడో విడత ఎన్నిక బరిలో నిలిచన, ఏకగ్రీవమైన స్థానాల సంఖ్య
జిల్లా జీపీలు సర్పంచ్బరిలో ఏకగ్రీవాలు వార్డులు ఏకగ్రీవం బరిలో
వరంగల్ 109 305 07 946 137 1837
హనుమకొండ 68 230 01 634 71 1424
జనగామ 91 267 03 800 108 1632
భూపాలపల్లి 81 296 03 696 126 1347
ములుగు 46 157 01 358 78 863
మహబూబాబాద్ 169 516 19 1412 272 2869
మొత్తం 564 1,771 34 4,846 792 9,972
