థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు కమెడియన్ పృథ్వీరాజ్. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గత 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన నాలుగు రోజుల కింద కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో కరోనా నెగిటివ్ గా వచ్చింది. అయితే సోమవారం జ్వరం తీవ్రమవడంతో.. వైద్యులు ఆయనకు 15 రోజుల క్వారంటైన్ సూచించారు. దాంతో ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. వైద్యుల సూచన మేరకే.. తాను ఆస్పత్రిలో చేరానని.. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి దయ వల్ల బాగానే ఉన్నానని ఆయన ఆ వీడియోలో తెలిపారు.
పృథ్వీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయనకు ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి లభించింది. అయితే ఆయనపై వచ్చిన కొన్ని ఆరోపణల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు.
For More News..
