- పార్టీలో అందరూ అసంతృప్తితో ఉన్నరు: రాములు నాయక్
‘టీఆర్ఎస్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలంతా అసంతృప్తితో ఉన్నరు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. హుజూర్నగర్లో ఆ పార్టీ ఓటమి తర్వాత మరింత అసంతృప్తి బయటపడుతుంది’ అని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్అన్నారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే సంతృప్తిగా ఉందన్నారు. ఆ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే విషయం బయటపడుతుందని చెప్పారు. ఈ ఎన్నికలు ధనబలానికి, ప్రజాబలానికి మధ్య జరుగుతున్నాయని, హుజూర్నగర్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యానికి, టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ కుటుంబానికి లాభమని అన్నారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆలోచించి మాట్లాడాలన్నారు. ఓటమి భయంతోనే గ్రామానికో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్లిన వెంటనే హుజూర్నగర్లో కోడి బొక్కలు, క్వార్టర్ సీసాలు మొదలవుతాయని కామెంట్ చేశారు. ఎలక్షన్లు, కలెక్షన్లతోనే టీఆర్ఎస్ బతికిందని, ఈ సారి భయపెట్టి గెలవాలనుకుంటోందని ఆరోపించారు.