చిరునవ్వుతో ఇంటికెళ్లే సినిమా: శర్వానంద్

చిరునవ్వుతో ఇంటికెళ్లే సినిమా: శర్వానంద్

శర్వానంద్, రష్మిక జంటగా రూపొందిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఫిబ్రవరి 25న విడుదల కానున్న సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు.  శర్వానంద్ మాట్లాడుతూ ‘‘శతమానం భవతి’ లాంటి ఫ్యామిలీ మూవీ, మహానుభావుడు’ లాంటి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ చేయమని అడుగుతున్నారు. వాళ్లందరికీ ఒకటే చెబుతాను... ఓ మంచి చిత్రం చూశామనే చిరునవ్వుతో ఇంటికెళ్లే సినిమా ఇది. రాధిక, ఖుష్బూ లాంటి సీనియర్స్‌‌‌‌తో నటించడం గర్వంగా ఉంది. ఇంత మంచి స్క్రిప్ట్‌‌‌‌తో సినిమా తీసిన కిషోర్‌‌‌‌‌‌‌‌కి థ్యాంక్స్‌‌‌‌. చాలా హ్యాపీగా చేసిన సినిమా ఇది’ అన్నాడు. రష్మిక మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడే చాలా నవ్వాను. షూటింగ్ మొదలు డబ్బింగ్ వరకూ అంతా నవ్వుతూనే ఉన్నాను. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. నా ఫేవరేట్‌‌‌‌ మూవీస్‌‌‌‌లో ఇదొకటి. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అంది.

రాధిక మాట్లాడుతూ ‘ఆడవాళ్లకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా బాగా రాసిన కథ ఇది. ఓ ఫ్యామిలీలా అంతా కలిసి వర్క్ చేశాం. టీమ్ అంతా ఒక దగ్గర కూర్చుని ప్రతి సీన్ గురించి మాట్లాడుకుంటూ షూటింగ్ చేశాం’ అన్నారు. ‘అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్‌‌‌‌తో అద్భుతంగా తీశారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌కి తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు ఖుష్బూ. ‘సినిమా ఇంత హ్యాపీగా రావ‌‌‌‌డానికి కార‌‌‌‌ణ‌‌‌‌మైన ఆడవాళ్లంద‌‌‌‌రికీ థ్యాంక్స్’ చెప్పారు కిషోర్ తిరుమల. రాజశ్రీ నాయర్, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్, సోనియా చౌదరి తదితరులు పాల్గొన్నారు.