హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీ ఓటర్లు, ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉండడంతో సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్శాతం తగ్గడం, పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతుండడం వంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్చేస్తున్నారు. వీటిని కొందరూ ట్రోలింగ్చేస్తూ కామెంట్స్పెడుతున్నారు. సిటీలో మాల్స్ ఓపెన్ రెండు, మూడు వారాల పాటు సిటీ జనాలపై కిటకిటలాడుతాయి.. కానీ ఎన్నికల రోజున ఓటు వేసేందుకు వెళ్లకపోతుండగా.. సెంటర్లు వెలవెలబోతున్నాయే అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
వీటికి కొందరూ “షాపింగ్పై ఉన్న శ్రద్ధ ఓటింగ్పై లేదాయే ” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఇంట్లో నిద్ర పోవడానికి కాదు పోయి ఓటు వేయండని, సినిమా రీ రిలీజ్ ఉన్నప్పుడు, మాల్స్లో షాపింగ్ఆఫర్స్ఉన్నప్పుడు క్యూలైన్ కట్టి గంటల పాటు నిల్చొని ఉంటారు, కానీ పోలింగ్ కేంద్రాల్లో ఒక గంట పాటు వేచి ఉండరని, ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్లరు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తారు అని ట్రోలింగ్ జోరుగా సాగుతోంది.
తక్కువ పోలింగ్ శాతం నమోదవడంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్కు ముందే ఓటు హక్కుపై పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖలు, ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలు, వాకథాన్ల ద్వారా అవగాహన కల్పించింది. అయినా ఐటీ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిసారి లాగే ఈసారి కూడా ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు.