నిషేధిత హాష్ ఆయిల్(గంజాయి ఆయిల్)ని అమ్ముతున్న నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శాపూర్నగర్లోని బాలానగర్జోన్లో జులై 22న జరిగింది. డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావ్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
బాచుపల్లి, సనత్నగర్పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత హాష్ ఆయిల్ విక్రయిస్తున్న సమాచారం పోలీసులకు అందింది. రంగంలోకి దిగిన బాలనగర్, మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు బాచూపల్లి, సనత్నగర్పోలీస్స్టేషన్ పరిధిలలో హష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 300 హష్ ఆయిల్ బాటిళ్లు, నాలుగు సెల్ఫోన్లు, కారు, రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ తరలించామని.. మరొకరు పరారీలో ఉన్నట్లు బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.