గంజాయి ఆయిల్ అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్.. భారీగా ఆయిల్​ పట్టివేత

గంజాయి ఆయిల్ అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్.. భారీగా ఆయిల్​ పట్టివేత

నిషేధిత హాష్​ ఆయిల్​(గంజాయి ఆయిల్)ని అమ్ముతున్న నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​ శాపూర్​నగర్​లోని బాలానగర్​జోన్​లో జులై 22న జరిగింది. డీసీపీ కార్యాలయంలో బాలానగర్​ డీసీపీ శ్రీనివాస్​ రావ్​ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.  

బాచుపల్లి, సనత్​నగర్​పోలీస్​స్టేషన్​ పరిధిలో నిషేధిత హాష్​ ఆయిల్​ విక్రయిస్తున్న సమాచారం పోలీసులకు అందింది. రంగంలోకి దిగిన బాలనగర్, మాదాపూర్​ ఎస్ వోటీ పోలీసులు బాచూపల్లి, సనత్​నగర్​పోలీస్​స్టేషన్ పరిధిలలో హష్​ ఆయిల్​ అమ్ముతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి 300 హష్​ ఆయిల్ బాటిళ్లు, నాలుగు సెల్​ఫోన్​లు, కారు, రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​ తరలించామని.. మరొకరు పరారీలో ఉన్నట్లు బాలనగర్​ డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.