![మూడు రోజులు పసుపు కొనుగోళ్లు బంద్](https://static.v6velugu.com/uploads/2024/02/three-days-closed-for-turmeric-purchases_PWyVQavo7X.jpg)
మెట్పల్లి, వెలుగు: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్లో 3 రోజులు పసుపు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతర నేపథ్యంలో వ్యాపారులు, కమీషన్ఏజెంట్లు, హమాలీ, దడవాయి, కూలీల విజ్ఞప్తి మేరకు గురువారం, శుక్రవారం, శనివారం మార్కెట్ లో పసుపు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ మూడు రోజులు మార్కెట్ కు పసుపు తీసుకురావద్దని సూచించారు.