యూపీలో బస్సు బోల్తా..ముగ్గురు మృతి

యూపీలో బస్సు బోల్తా..ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. అలీఘర్ జిల్లాలోని తప్పల్  వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా .. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  బస్సు కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళుతుండగా ఈప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

బస్సు ప్రమాదంపై  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించారు.