విషాదం...చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి..

విషాదం...చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి..

వనపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ముగ్గురు  బాలికలు చెరువులో పడి మృతి చెందారు. బాలికల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

వివరాల్లోకి వెళ్లే..

శ్రీరంగాపురం మండలం తాటిపాముల వీరసముద్రం చెరువువద్దకు బట్టలు ఉతికేందుకు ముగ్గురు బాలికలు వెళ్లారు. ఈ సమయంలో లోతు ఎక్కువగా ఉండటాన్ని గమనించలేదు. చెరువులో దిగడంతో నీటమనిగి చనిపోయారు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.తిరుపతమ్మ(12), సంధ్య(9) , దీపిక(7)లుగా గుర్తించారు.  బాలికల మృతితో  ఆ గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో పేరంట్స్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.