నవీపేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు

నవీపేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు

నవీపేట్, వెలుగు  : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఎస్సై సమాచారం ప్రకారం.. పోతంగల్ గ్రామానికి చెందిన ఈర్నాల రాజు, ఖురేషి చంద్ పాషా, నవీపేట్ కు చెందిన ధ్యారం గోపి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డారు. మంగళవారం కోర్టులో హాజరు పర్చగా, సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నుర్జహన్ బేగం  రాజు, ఖురేషి లకు 4 రోజులు, గోపీకి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.