
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా హోసూరు దగ్గర కంటెయినర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు మరో మహిళ ఉన్నారు. గాయపడ్డవారిని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అత్యవసర చికిత్స నిమిత్తం హోసూరు ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్, ఎస్పీ గంగాధర్ ప్రమాదస్థలికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.