
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో విమానం ప్రమాదం ఎలా జరిగింది.. ఎలా కూలిపోయింది.. కూలిపోయిన ప్రాంతంలో ఏముందీ.. ఈ విషయాలపై స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోనే BJ మెడికల్ కాలేజీ ఉంది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్.. అంటే డాక్టర్లకు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. రెండు హాస్టల్ బిల్డింగ్స్ ఎదురెదురుగా ఉంటాయి.. మధ్య ఖాళీ స్థలం ఉంది.
ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా 717 విమానం.. జస్ట్ ఆరు అంటే ఆరు కిలోమీటర్ల దూరంలోని BJ మెడికల్ కాలేజీ దగ్గరకు రాగానే పూర్తిగా కంట్రోల్ తప్పింది.ఆ వెంటనే BJ మెడికాల్ కాలేజీ హాస్టల్ లోని ఓ బిల్డింగ్ ను చీల్చుకుంటూ వెళ్లి పేలిపోయింది.
BJ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పూర్తిగా దెబ్బతిన్నది.. రెండు భవనాల మధ్య ఉన్న ప్రాంతంలో విమానం ఇంజిన్ పడిపోయింది. విమానం బిల్డింగ్ ను బలంగా తాకిన వెంటనే పేలిపోయింది. దీంతో మెడికల్ హాస్టల్ కు సంబంధించి.. రెండు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Also Read : అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి
హాస్టల్ లో ఉన్న 20 మంది డాక్టర్లు చనిపోయినట్లు కాలేజీ సిబ్బంది ప్రకటించారు. మరికొంత మంది డాక్టర్ల ఆచూకీ లేదని.. వాళ్ల కోసం వెతుకున్నట్లు ప్రకటించింది కాలేజీ యాజమాన్యం.కాలేజీ హాస్టల్ లోని సిబ్బంది కూడా గాయపడ్డారని.. వాళ్లకు చికిత్స చేస్తున్నామని.. కాలేజీపై విమానం పడటం.. అది పేలిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయిందని.. ఎవరికీ ఏమి అర్థం కాలేదని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు.
కాలేజీ హాస్టల్ బిల్డింగ్ ను విమానం చీల్చుకుంటూ వచ్చిన క్షణాల్లోనే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని.. ఆ వెంటనే మంటలు వ్యాపించాయని.. వేడి తీవ్రత చాలా ఎక్కువగా వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.భవనాల్లోని అద్దాలు పగిలిపోయాయని.. బిల్డింగ్ అంతా ఎగిరి పడినట్లు అనిపించిందని.. మొదట భూకంపం అనుకున్నాం అని.. ఆ తర్వాతే ఏదో ప్రమాదం జరిగినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు హాస్టల్ సిబ్బంది.