ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి 'Mayday Call'.. అసలేంటిది..?

ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి 'Mayday Call'.. అసలేంటిది..?

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం అకస్మాత్తుగా 5 నిమిషాల్లోనే కూలిపోవటం అంతుచిక్కని మిస్టరీగా మారింది. విమానం భారీ ఎత్తునుంచి కూలిపోవటంతో పాటు అప్పుడే టేకాఫ్ కావటంతో ఫుల్ ఫ్యూయల్ కెపాసిటీతో విమానం ఉండొచ్చని తెలుస్తోంది. అయితే నివాస ప్రాంతాలపై విమానం పడిన సమయంలో ఒక్కసారిగా పేలుడు కూడా జరిగింది. 

అయితే విమానం రన్ వే నుంచి 1.39కి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం నుంచి పైలట్లు ఎయిర్ పోర్టులోని ఏటీసీకి 'Mayday Call' పంపారు. అయితే వాస్తవానికి మేడే కాల్ అనేదానిని అత్యవసర సమయంలో తాము ప్రమాదంలో ఉన్నామని, తమకు సహాయం కావాలని కోరుతూ షిప్పులు, విమానాలు రేడియో కమ్యూనికేషన్ ద్వారా పంచుకునే వ్యవస్థ. ఇది తమకు ప్రాణాపాయం ఉందని సహాయం కావాలని కోరుతూ చేసే రిక్వెస్ట్. అయితే ఎయిర్ ఇండియా విమానం నుంచి ఈ కాల్ వచ్చిన తర్వాత ఏటీసీ విమానంలోని కెప్టెన్ ను సంప్రదించేందుకు చేసిన కాల్స్ కి ఎలాంటి రిప్లై రాలేదని అధికారులు వెల్లడించారు. 

Also Read : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కుప్పకూలిన టాటా స్టాక్స్

ప్రస్తుతం విమాన ప్రమాద ప్రదేశంలో పరిస్థితులు చూస్తుంటే ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అదొక విమానం అని గుర్తించలేని స్థాయిలో కాలిపోవటం చూస్తుంటే ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయాలతో బయటపడ్డారనే విషయాలు అధికారికంగా ప్రభుత్వం లేదా విమానయాన సంస్థ ప్రకటించే వరకు తెలియకపోవచ్చు. 

విమానంలో 169 మంది భారతీయ ప్రయాణికులు, 53 మంది బ్రిటీష్ ప్రయాణికులు, 1 కెనడియన్ ప్రయాణికుడు, 7 మంది పోర్చుగీస్ ఉన్నట్లు వెల్లడైంది. దీనికి అదనంగా విమాన క్రూ సిబ్బంది కూడా అందులో ఉన్నారు. ప్రమాదం జరిగిన విమానంలో మెుత్తం 10 మంది వరకు ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదం తర్వాత విమానయాన శాఖ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు, ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ భారీగా రెస్క్యూ సేవలు కొనసాగుతున్నాయి.