
Air India Plane Crash: మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరువలో పెద్ద విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 242 మందితో లండన్ వెళుతున్న విమానం మేఘాని ప్రాంతంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. విమానం క్రాష్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం క్రాష్ అవడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు అసలు ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
అయితే ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరగటంతో ఒక్కసారిగా టాటా గ్రూప్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్లు ప్రమాదంతో గందరగోళానికి గురి కావటం టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీ షేర్లపై ప్రభావాన్ని చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రమాద సమయంలో స్టాక్ మార్కెట్లలో టాటా స్టాక్స్ పనితీరు..
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: 1% కంటే ఎక్కువ క్షీణత
- టాటా స్టీల్: షేర్లు 3% తగ్గాయి
- టాటా పవర్: 2.5% తగ్గింది
- టాటా ఈఎల్ఐఎక్స్: 2% కంటే ఎక్కువ నష్టం
- టాటా కమ్యూనికేషన్స్: 1% పైగా పడిపోయింది
- టాటా మోటార్స్: 3% కంటే ఎక్కువగా నష్టపోయింది
- టాటా కెమికల్స్: 3% తగ్గింది
- టాటా కన్స్యూమర్: 2% పైగా పడిపోయింది
- టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్: దాదాపు 4% తగ్గింది
- ఇండియన్ హోటల్స్: 2% పైగా పెరిగాయి
టాటాల చేతికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్ ఇండియాలో తరచుగా లోపాలు, ప్రయాణ సమయంలో కొన్ని ప్రమాదాలు జరగటం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి టాటా గ్రూప్ నమ్మకానికి, నాణ్యతకు పెట్టింది పేరని భారతదేశంలో సగటు ప్రజల నమ్మకం. అయితే ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానం గుజరాత్ రాష్ట్రంలో ప్రమాదానికి గురికావటంతో బలహీనంగా ఉన్న మార్కెట్లలో ప్రకంపనలు పుట్టించింది.
Also Read : అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం
ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగిందనే విషయం బయటకు రాలేదు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేక మరణించారా అసలు ఆస్తి నష్టం ఎంత, ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను ఇప్పటి వరకు అధికారికంగా ఎవ్వరూ వెల్లడించకపోవటం ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు.