కాంగ్రెస్​లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు

కాంగ్రెస్​లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలో బీఆర్​కు మరో షాక్​తగిలింది. ఇప్పటికే పలువురు మున్సిపల్​కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరగా.. తాజాగా మరో ముగ్గురు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కౌన్సిలర్లు ఎలిగేటి సుజాత, తుంగపెల్లి సుజాత, పోలు ఉమాదేవి కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు. వీరితోపాటు లీడర్లు ఎలిగేటి శ్రీనివాస్, తుంగపెల్లి గంగాదర్, పోలు శ్రీనివాస్, బైరి శంకర్, జంజిరాల మనోహర్, ఎస్కె ఖలీల్, ఎలిగేటి మల్లేశ్​సహా దాదాపు 50 మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్  ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.  

కాంగ్రెస్​లో చేరిన కాసిపేట ఎంపీపీ లక్ష్మి

బెల్లంపల్లి రూరల్: కాసిపేట మండల ఎంపీపీ రొడ్డ లక్ష్మి బీఆర్ఎస్​ను వీడారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్​ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరగా ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే వినోద్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్​ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కాసిపేట మండల ఇన్​చార్జి గడ్డం జగన్నాథం, మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, నాయకులు రాపర్తి శ్రీనివాస్, నర్సింగ్, రొడ్డ రవికుమార్ ​ పాల్గొన్నారు.